Friday 31 January 2014

సనాతన ధర్మం

మన ఈ సనాతన ధర్మంలో కొన్ని ముఖ్య విషయాలు

-ఒక పండగ చేసుకోవలసిన తీరులో చేసుకొని ఉన్నతిని పొందవచ్చు, ఒక్క ఏకాదశి, ఒక్క శివరాత్రి చాలు.
-నిరంతరం ఒక స్తుతి చదివుతూ ఉన్నతిని పొందచ్చు, ఏమీ వద్దు కేవల భగవన్నామ స్మరణం చాలు.
-ఎన్ని తప్పులు చేసినా తప్పు తెలుసుకొని సంపూర్ణ ప్రాయశ్చిత్త చిత్తంతో శరణాగతిద్వారా ఉన్నతిని పొందచ్చు, దీన్ని కన్ఫెషన్స్ తో పోల్చడం కన్నా తెలివితక్కువతనం లేదు.
-మరణం తరవాత చేసుకొన్న మంచి, చెడు కర్మలను బట్టి ఊర్థ్వ/అధోలోకాలుంటాయి. అది ఆశచూపడం కాదు అది సనాతన ధర్మ మూల సిద్ధాంతాలలోఒకటైన కర్మ సిద్ధాంతం. దీన్ని ప్రశ్నించేవాడు ఈ ధర్మంలో చరించేవాడే కాదు. అవైదిక మతంలో చరిస్తూ ప్రచారం చేస్య్కొనేవాడికన్నా అసలు వాడే ఈ ధర్మానికి బద్ధవిరోధి కూడా.
-జీవన్ముక్తులు అనే పదం లేదా ఈ పదం అన్వయమయ్యేది సనాతన ధర్మంలోని వారికే, అక్కణ్ణుంచే ఇతర మతాలు అరువెత్తుకెళ్ళాయి. ఇక్కడే ఇప్పుడే బ్రతికుండగానే ఆత్మ స్వరూపుడవు కావచ్చు, సత్యం తెలుసుకొవచ్చు అనేది కేవల సనాతన ధర్మ సిద్ధాంతమే, ఇతరత్రా మనిషి బుద్ధిలోంచి పుట్టినది కాదు.
-తెలిసో తెలియకో మహాత్ములు తిరుగాడిన ప్రదేశాలలోగానీ, ఆశ్రమాలలోగానీ, వారు వసించిన ప్రదేశాలలోగానీ, పుణ్యక్షేత్రాలలోగానీ ఎందుకు తిరిగినా ఎప్పుడు ఎలా తిరిగినా అది కేవల భగవత్సంకల్పం దానివల్లనూ ఉన్నతమైన ఫలితాలుంటాయి, ఒక్క నదీ స్నానం చాలు, ఒక్క తీర్థ నమస్కారం చాలు ఉద్ధరింపబడడానికి. తప్ప అది గొఱ్ఱెలు, పందులు రొచ్చులోపడి తిరిగేలాంటి చందంకాదు.
-హాస్యోక్తులలో భగవన్నామం తలచుకున్నా భగవంతుడుద్ధరిస్తాడు
- ఇంకా ఎన్నో రకాలు, ఒకటి కాదు రెండుకాదు ఎంతమంది ఎలా ఉద్ధరింపబడ్డారో అని తెలుసుకోవడానికి ఎన్నో ఉదాహరణలు కోకొల్లలు
-ఎన్నో ఎన్నో విధాల అందరినీ ఉద్ధరించగలిగే ధర్మం నా సనాతన ధర్మం - సార్వభౌమత్వం ఉన్న ఏకైక ధర్మం 

No comments:

Post a Comment