Saturday 26 April 2014

భాగవతంలోని గజేంద్రమోక్షం లోని భాగం --- కరిఁ దిగుచు మకరి సరసికి

కరిఁ దిగుచు మకరి సరసికి
గారి దరికిని మకరిఁ దిగుచుఁ గరకరి బెరయన్
గారికి మకరి మకరికిఁ గరి
భరి మనుచును నతలకుతల భటు లరుదు పడన్ .




పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షం లోని భాగం లో రచించిన పద్యం ఇది. ఏనుగు నీరు త్రాగడానికి నదిలో దిగినప్పుడు ముసలి ఎనుగుపాదం తన నోటితో గట్టిగా పట్టుకుంది.

భావం :- ఒకరిపై ఒకరికి పగ పెరిగే విధముగా ముసలి, ఏనుగు ఆ నదిలో పోరాడుచున్నవి. ముసలి, ఏనుగును నదిలో లాగుచున్నది. ఏనుగు ముసలిని నెల పైకి ఈడ్చుచున్నది. ఒకదానికి ఒకటి భయపడకుండా పోరాడుచిన్నవి. 

No comments:

Post a Comment